Rahul Gandhi: కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడమే కాంగ్రెస్ తొలి ప్రాధాన్యత

Rahul Gandhi: కశ్మీర్ పర్యటనలో భాగంగా శ్రీనగర్‌లో పార్టీ కార్యకర్తలతో రాహుల్ సమావేశం

Update: 2024-08-22 14:15 GMT

Rahul Gandhi: కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడమే కాంగ్రెస్ తొలి ప్రాధాన్యత

Rahul Gandhi: జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడమే కాంగ్రెస్, ఇండియా కూటమి తొలి ప్రాధాన్యత అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కశ్మీర్ పర్యటనలో భాగంగా శ్రీనగర్ లో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. కశ్మీర్, లడఖ్ ప్రజలు ప్రజాస్వామ్య హక్కులను తిరిగి పొందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర హోదా ఎంతో ముఖ్యమని నొక్కి చెప్పారు. ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్ నిరంతరం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు రాహుల్.

Tags:    

Similar News