జమ్మూ కశ్మీర్‌లో పేలుడు.. ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి

స్క్రాప్‌ డీలర్‌ ట్రక్కులో పేలుడు

Update: 2024-07-29 15:00 GMT

జమ్మూ కశ్మీర్‌లో పేలుడు.. ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సోపోర్‌లోని షేర్‌ కాలనీలో ఈ ఘటన జరిగింది. స్క్రాప్‌ డీలర్‌ ట్రక్కులో పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సోపోర్‌ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పేలుడు ఘటనను ధ్రువీకరించారు. ప్రస్తుతం పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియరాలేదని.. కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు తెలిపారు.

Tags:    

Similar News