మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నద్ధం

దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాట్ల హడావిడి

Update: 2024-06-06 12:42 GMT

మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నద్ధం

ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నద్ధం అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాట్ల హడావడి కొనసాగుతుంది. రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఆ భేటీలో బీజేపీ పక్షనేతను ఎన్నుకోనున్నారు. అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలందరూ భేటీకానున్నారు. రేపటి సమావేశం కోసం ఇప్పటికే పలువురు ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇప్పటికే ఎన్డీయే నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. ఇదే విషయాన్ని రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిని కలిసి కూటమి నేతలు తెలపనున్నారు. తమ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతికి లేఖ అందించనున్నారు.

Tags:    

Similar News