Arvind Kejriwal: ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్ బిగ్ ఛాలెంజ్.. ఓడిపోతే మోదీకి ప్రచారం చేస్తానని ప్రామిస్

Update: 2024-10-06 13:02 GMT

Arvind Kejriwal to PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వినర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఛాలెంజ్ విసిరారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ పథకం ప్రారంభిస్తే తానే ప్రధాని మోదీ తరపున ప్రచారం చేస్తానని అన్నారు. ఢిల్లీలో జరిగిన జనతా కీ అదాలత్ అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపి డబుల్ ఇంజన్ అని చెప్పుకుంటున్న అన్ని రాష్ట్రాల్లో పరిపాలనలో విఫలమైందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అసలు డబల్ ఇంజన్ సర్కారు అంటే డబుల్ లూట్, డబుల్ అవినీతి సర్కారు అవుతోంది అని బీజేపిపై విమర్శలు గుప్పించారు.

నిన్నటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే హర్యానా, జమ్మూ కశ్మీర్ లోనూ బీజేపిని సాగనంపిస్తున్నారు అని అర్థమైంది. డబుల్ ఇంజన్ సర్కారుని జనం సాగనంపిస్తున్నారనడానికి ఇంతకంటే ఎక్కువ ఇంకేం కావాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

బీజేపి నిరుపేదల వ్యతిరేకి అని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అందుకే బస్సుల్లో మార్షల్స్ ని తొలగించింది. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ని ఉద్యోగాల నుండి తొలగించింది. ఆఖరికి హోమ్ గార్డ్స్ కి జీతాలు కూడా ఇవ్వకుండా నిలిపేశారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

Tags:    

Similar News