ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది నక్సల్స్ మృతి

పోలీసులు- మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

Update: 2024-09-03 08:39 GMT

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది నక్సల్స్ మృతి

ఛత్తీస్ గఢ్ బస్తర్ లో మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో పది మంది మావోయిస్టులు చనిపోయారు. భద్రతా బలగాలు కచ్చితమైన సమాచారం ఆధారంగా దంతెవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఈ సమయంలో తమపై మావోయిస్టులు కాల్పులకు దిగారని... ఆత్మరక్షణ కోసం తాము జరిపిన కాల్పుల్లో ౧౦ మంది నక్సలైట్లు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సంఘటనస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News