Amit Shah: జమ్మూ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్‌షా

Amit Shah: జమ్మూలో మళ్లీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే వారి ప్రధాన లక్ష్యం

Update: 2024-09-07 10:15 GMT

Amit Shah: జమ్మూ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్‌షా

Amit Shah: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, రాళ్ల దాడులను ప్రోత్సహించే వారిని జైళ్ల నుంచి విడుదల చేయాలని వారు కోరుకుంటున్నారని పరోక్షంగా కాంగ్రెస్, ఎన్‌సీ కూటమిని విమర్శించారు అమిత్‌షా. జమ్మూలో మళ్లీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే వారి ప్రధాన లక్ష్యమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొనేంత వరకూ పాకిస్థాన్‌ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.

Tags:    

Similar News