Mumbai-Howrah: ఝార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ వద్ద రైలు ప్రమాదం

Mumbai-Howrah: తెల్లవారుజామున 3.45 గంటలకు ప్రమాదం

Update: 2024-07-30 13:17 GMT

Mumbai-Howrah: ఝార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ వద్ద రైలు ప్రమాదం 

Mumbai-Howrah: ఝార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ వద్ద ముంబయి-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి రైల్వే అధికారులు చేరుకున్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. జంషేడ్‌పూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంబంబూ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 18 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి కొంతదూరంలో మరో గూడ్స్‌ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది.

Tags:    

Similar News