కాసేపట్లో ఇండియా కూటమి నేతల సమావేశం
ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల భేటీ
ఇండియా కూటమి నేతలు కాసేపట్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ కానున్నారు. ఇప్పటికే రాహుల్, ప్రియాంకలు ఖర్గే నివాసానికి చేరుకోగా... మరికొందరు నేతలు ఒక్కొక్కరిగా వస్తున్నారు. భేటీలో తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం చంపై సోరేన్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, డి రాజా, ఏచూరిలు పాల్గొననున్నారు.