Chhattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. బాంబ్‌ పేలి ఇద్దరు జవాన్లు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోలు ఘాతుకం సృష్టించారు.

Update: 2024-07-18 05:43 GMT

Chhattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. బాంబ్‌ పేలి ఇద్దరు జవాన్లు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకం సృష్టించారు. మావోలు ఏర్పాటు చేసిన బాంబ్ పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రాయ్‌గఢ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టార్రెమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది.

మందమార్క అడవుల్లో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చారు. కూంబింగ్  ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా పైప్ బాంబు పేలి STF హెడ్ కానిస్టేబుల్ భరత్ లాల్ సాహు, కానిస్టేబుల్ సతేర్ సింగ్ వీరమరణం పొందగా, పురుషోత్తమ్ నాగ్, కోమల్ యాదవ్, సియారామ్ సోరి, సంజయ్ కుమార్ అనే నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. 

Tags:    

Similar News