Sreeja Konidela: తనతో కొత్త జర్నీ ప్రారంభమైంది..

Sreeja Konidela: 2022 లో ముఖ్యమైన వ్యక్తిని కలిసాను అంటున్న శ్రీజ కొణిదెల

Update: 2023-01-03 08:00 GMT

Sreeja Konidela: తనతో కొత్త జర్నీ ప్రారంభమైంది అంటున్న మెగాస్టార్ కూతురు

Sreeja Konidela: మెగాస్టార్ చిరంజీవి రెండవ కూతురు శ్రీజ కొణిదల ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మొదటి భర్త నుంచి విడిపోయి వచ్చిన శ్రీజ.. కళ్యాణ్ దేవ్ ని రెండవసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. కానీ గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీజ మరియు కళ్యాణ్ దేవ్ కి మధ్య దూరం పెరిగిందని వీరు త్వరలోనే విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కానీ వీరిరువు మాత్రం దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా స్పందించలేదు. కానీ తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీజ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారుతుంది. "డియర్ 2022 నా జీవితంలోని అతి ముఖ్యమైన వ్యక్తిని కలిపినందుకు చాలా థాంక్స్. తనకి నా గురించి అన్నీ తెలుసు అయినా నేనంటే ఎంతో ప్రేమ నన్ను కేర్ చేసే వ్యక్తి మరియు ఎలాంటి ఒడిదుడుకుల్లోనైనా నాకు తోడుగా ఉండే వ్యక్తి. డియర్ 'మీ' నిన్ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మన జర్నీ మొదలవుతుంది," అంటూ శ్రీజ కొణిదల ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ ని షేర్ చేసింది.

2022లో ఆమె తనను తానే కొత్తగా కలుసుకున్నానని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చింది శ్రీజ. ఇక తనతో తాను కొత్త జర్నీ మొదలు పెట్టాలని శ్రీజ నిర్ణయించుకుంది. దీంతో ఇన్ డైరెక్ట్ గా ఆమె కళ్యాణ్ దేవ్ ని వదిలేసి జీవితంలో ముందుకు వెళ్లడానికి డిసైడ్ అయినట్టు చెప్పకనే చెబుతోంది.



 

Tags:    

Similar News