జనసేన ఎన్నికల గుర్తు వచ్చేసింది... ఇకపై పవన్ కళ్యాణ్ చాయ్‌వాలా

Update: 2018-12-23 06:08 GMT

జనసేన పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల గుర్తును కేటాయించింది. జనసేనకు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని జనసేన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. జనసేన పార్టీని 2014 మార్చి 14న సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా జనసేనాని ప్రచారం నిర్వహించారు. అయితే తెలంగాణలో ఈ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి విధానాన్ని అవలంభించలేదు.దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు వివిధ గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. సాధారణ ఎన్నికలతోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు వర్తించనుంది.
 

Similar News