టీడీపీ, వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియాలో పోస్టులు: ఏం బయటపెడతారు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 24న సంచలన విషయాలు బయట పెడతామని వైఎస్ఆర్ సీపీ, టీడీపీలు సోషల్ మీడియాలో పోస్టు చేశాయి.

Update: 2024-10-24 06:36 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 24న సంచలన విషయాలు బయట పెడతామని వైఎస్ఆర్ సీపీ, టీడీపీలు సోషల్ మీడియాలో పోస్టు చేశాయి. అసలు ఈ రెండు పార్టీలు ఏ అంశాలను బయట పెడతారనే విషయమై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను జగన్ ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. మరో వైపు గత ప్రభుత్వ తీసుకున్న విధానాలతో ప్రజలు ఎలా ఇబ్బందిపడ్డారో తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. జగన్ పాలనకు తమ పాలనకు మధ్య తేడాను గమనించాలని ప్రజలను కోరుతున్నారు.TDP and YSRCP challenges on Social media

Tags:    

Similar News