Pinnelli Ramakrishna Reddy: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి

Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.

Update: 2024-08-24 06:28 GMT

Pinnelli Ramakrishna Reddy: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి

Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. రెంటచింతల, కారంపూడి ఘటనల్లో పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన పిన్నెల్లికి మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా కారులో ఎక్కి వెళ్లిపోయారు. పిన్నెల్లి అరెస్ట్ అక్రమమంటూ మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు.

Tags:    

Similar News