KS Jawahar Reddy: ఏపీ నూతన సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం

KS Jawahar Reddy: ఏపీ నూతన సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం

Update: 2022-11-29 11:27 GMT

KS Jawahar Reddy: ఏపీ నూతన సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం

KS Jawahar Reddy: ఆంధ్రప్రదేశ్ నూతన ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. జవహర్‌ రెడ్డిని సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఛీఫ్ సెక్రటరీగా ఉన్న సమీర్ శర్మ నవంబర్ 30న రిటైర్ కానున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే సమీర్ శర్మ పదవీకాలం ముగిసినా..ప్రభుత్వం మరో ఆరునెలలు పొడిగించింది. మరోసారి పొడిగించేందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో రిటైర్మెంట్ అనివార్యమైంది. ఆయన స్థానంలో కేఎస్ జవహర్ రెడ్డి ఛీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. డిసెంబర్‌ 1 నుంచి కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి బాధ్యతలు తీసుకుంటారు. జవహర్‌ రెడ్డి ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సీఎం జగన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పని చేశారు.

Tags:    

Similar News