ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం

Update: 2021-01-06 08:55 GMT

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జస్టిస్ గోస్వామితో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పలువరు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జస్టిస్‌ గోస్వామి హైకోర్టుకు చేరుకోనున్నారు.

Tags:    

Similar News