Tirumala: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Update: 2024-05-24 11:04 GMT

Tirumala: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

Tirumala: ఎన్నికలు పూర్తి కావడం, వేసవి సెలవులు కొనసాగుతుండటం.. విద్యార్ధుల పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తతున్నారు. కొన్ని రోజులుగా తిరుమల కొండపై విపరీతమైన రద్దీ నెలకొంటుంది. సామాన్య భక్తులు స్వామి వారి దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. ఈ మూడు రోజుల్లో వీఐపీ సిఫారసు లేఖలను స్వీకరించబోమని టీటీడీ ప్రకటించింది. ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని టీటీడీ కోరింది.

Tags:    

Similar News