Y S Sharmila: విభజన హామీలు తీసుకురావడంలో విఫలమయ్యారు

Y S Sharmila: రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని గులాంగిరి చేస్తున్నారు

Update: 2024-04-18 14:54 GMT

Y S Sharmila: విభజన హామీలు తీసుకురావడంలో విఫలమయ్యారు

Y S Sharmila: ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదాను సాధించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక హోదాను కల్పించడంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ప్రత్యేక హోదాను వినియోగించుకుంటున్నాయే తప్ప వాటి గురించి చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీకి జగన్‌ గులాంగిరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News