Mukesh Kumar Menna: మాచర్ల అల్లర్ల ఘటనపై ఈసీ చర్యలు

Mukesh Kumar Menna: పిన్నెల్లి EVM ధ్వంసం చేసిన విజువల్స్ EC నుండి బయటకు వెళ్లలేదు

Update: 2024-05-23 12:09 GMT

Mukesh Kumar Menna: మాచర్ల అల్లర్ల ఘటనపై ఈసీ చర్యలు

Mukesh Kumar Menna: మాచర్ల నియోజకవర్గంలో అల్లర్ల ఘటనపై ఈసీ చర్యలు తీసుకుంది. పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ పీఓ, ఏపీఓలపై వేటు వేశామని సీఈఓ ముకేష్ కుమార్‌ మీనా తెలిపారు. పిన్నెల్లి EVM ధ్వంసం చేసిన విజువల్స్ EC నుండి బయటకు వెళ్లలేదని...దర్యాప్తు సమయంలో ఎవరి నుండో బయటకు వెళ్లిందని తెలియజేశారు. పిన్నెల్లి ఆచూకీ కోసం పోలీస్ టీం పని చేస్తోందన్నారు. మాచర్లలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను..పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదని అభిప్రాయాన్ని సీఈఓ వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు పరామర్శకు వెళ్తే వైసీపీ శ్రేణులు కూడా పరామర్శకు వెళ్తామంటారని అన్నారు.

Tags:    

Similar News