AP News: ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు..!

AP News: ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. 1989వ ఐపీఎస్ బ్యాచుకు చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులను నిర్వహిస్తున్నారు.

Update: 2024-06-20 00:02 GMT

AP News: ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును రాష్ట్ర పోలీస్ బాస్ గా కూటమి సర్కార్ నియమించింది. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ద్వారకా తిరుమలరావు 1989వ బ్యాచుకు చెందిన ఐపీఎస్ అధికారి.

గత నెలలో ఏపీల ఎన్నికల కొన్ని రోజుల ముందుగా డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఆ సమయంలోనే ద్వారకా తిరుమలరావును ఏపీ డీజీపీగా నియమించే ఛాన్స్ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అనూహ్యంగా హరీశ్ కుమార్ గుప్తాకు ఏపీ పోలీస్ బాస్ అవకాశం ఇచ్చారు. ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్నికల నిర్వహణ మొత్తం కూడా హరీశ్ కుమార్ గుప్తా డీజీపీగానే కొనసాగింది. ఈ మధ్యే ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరింది. ఈ క్రమంలోనే భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు కొనసాగుతున్నాయి.

ఈ ఏడాది మేలో కొత్త డీజీపీగా నియమితులైన హరీశ్ కుమార్ గుప్తా 1992వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన తర్వాత సీనియర్లు అయిన అంజనా సిన్హా, ఎం ప్రతాప్ లను కాదని హరీశ్ ను పోలీస్ బాస్ గా ఎన్నికల సంఘం నియమించింది. కొత్తగా ఏర్పాటైన చంద్రబాబు ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న తిరుమలరావును రాష్ట్ర డీజీపీగా నియమించింది.

ద్వారకా తిరుమలరావు 1989వ బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. 2021 జూన్ నెలలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. ఆర్పీ ఠాకూర్ పదవీ కాలం మే 31న ముగిసింది. దీంతో అప్పటి జగన్ సర్కార్ ఆయన్ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. గత మూడు సంవత్సరాలుగా ఆయన ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. అంతకుముందు రైల్వే డీజీపీగా ఉన్నారు. విజయవాడ సీపీగానూ విధులు నిర్వహించారు. గతంలో విజయవాడ సీపీగా చేసిన గౌతమ్ సవాంగ్ వైసీపీ ప్రభుత్వంలో డీజీపీ అయ్యారు. తర్వాత ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్ గానూ సవాంగ్ తన సేవలను అందించారు. 


Tags:    

Similar News