Srisailam: శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

Srisailam: వేసవి సెలవులు ముగుస్తుండడంతో మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు

Update: 2024-05-27 16:00 GMT

Srisailam: శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

Srisailam: శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా క్షేత్రానికి భక్తులు తరలివస్తున్నారు. క్షేత్రం మొత్తం ఎటు చూసినా వాహనాలతో సందడి వాతావరణం నెలకొంది. క్షేత్రమంతా భక్తజనంతో సందడిగా మారింది. భక్తులు తెల్లవారుజామున నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో బారులు తీరారు. మరోపక్క భక్తులు శ్రీస్వామి అమ్మవారి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు అయితే భక్తుల రద్దీ దృష్ట్యాఅధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News