Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

Srisailam: స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం

Update: 2024-07-15 16:30 GMT

Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ                           

Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో మల్లన్న క్షేత్రంలో భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్త జనంతో సందడి వాతావరణం నెలకొంది. చిరు జల్లులు పడుతున్నా... లెక్కచేయకుండా వేకువజామున నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లికార్జున స్వామి దర్శనం కోసం బారులు తీరారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టిందని భక్తులు చెప్పారు. రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలోని భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్స్ అందిస్తున్నామని ఈవో పెద్దిరాజు తెలిపారు.                                             

Tags:    

Similar News