YS Jagan: తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం

YS Jagan Mohan Reddy: ఈనెల 28న తిరుమలకు కాలినడకన వెళ్లనున్న మాజీ సీఎం జగన్.

Update: 2024-09-25 15:16 GMT

YS Jagan: తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం

YS Jagan: తిరుపతి లడ్డూ వివాదం.. ఏపీలో రాజకీయంగా మరింతగా ముదురుతోంది. ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టేందుకు సిద్ధమైంది వైసీపీ. చంద్రబాబు చేసిన ఆరోపణలతో తిరుమల ఆలయ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను మంటగలిపారని పేర్కొంటూ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చింది వైసీపీ. అందులో భాగంగా వైసీపీ అధ్యక్షులు జగన్‌ ఈనెల 28న తిరుమలకు కాలినడకన వెళ్లనున్నారు.

అక్కడ స్వామివారికి పూజలు చేయనున్నారు. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని.. ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని.. కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారంటూ ఎక్స్‌ వేదికగా జగన్‌ నిలదీశారు. ఆరోజు వైఎస్సార్‌సీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు జగన్‌.

Tags:    

Similar News