Chittoor: పోలింగ్ ముగియడంతో జోరందుకున్న బెట్టింగ్

Chittoor: ఫలితాలకు సమయం ఉండటంతో కవ్వింపులు

Update: 2024-05-15 09:07 GMT

Chittoor: పోలింగ్ ముగియడంతో జోరందుకున్న బెట్టింగ్

Chittoor: మా నాయకుడిది గెలుపంటే... మా నాయకుడిదే విజయం అంటూ... పోటా పోటీ ప్రచారాలు ముగిసాయి. పోలింగ్‌కి ముందు పోటీ పడి ప్రచారాలు చేసిన నాయకుల అనుయాయులు... ఇప్పుడు మాదే గెలుపు... పందెమెంతో చెప్పు అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. కూటమి, వైసీపీ నేతలపై బెట్టింగులు కాస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో బెట్టింగులు జోరందుకున్నాయి. ఐపీఎల్ సీజన్‌లోనూ క్రికెట్‌ను తలదన్నేలా పొలిటికల్ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఫలితాలకు ఇంకా 20 రోజుల సమయం ఉండటంతో ఒకరినొకరు కవ్వింపులకు మొదలెట్టారు. బహిరంగంగానే పందెం కాస్తూ... బాండ్ పేపర్ రాసిస్తావా అంటూ మాటల యుద్ధం సైతం మొదలెట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపుపై పందేలు కాస్తుంటే... మరికొన్ని చోట్ల మెజారిటీపై పందెం వేసుకుంటున్నారట.

Tags:    

Similar News