వరద నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు విఫలం.. సీఎం చంద్రబాబు సీరియస్..

రాష్ట్రంలో వరద విలయంపై ఏపీ ప్రభుత్వం కసత్తు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.

Update: 2024-09-13 06:15 GMT

వరద నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు విఫలం.. సీఎం చంద్రబాబు సీరియస్..

రాష్ట్రంలో వరద విలయంపై ఏపీ ప్రభుత్వం కసత్తు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రేపటిలోగా అంచనాలు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు మరోసారి అధికారులతో భేటీ కానున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు పయనమవుతారు.

Tags:    

Similar News