ఉప్పల్‌లో రీపోలింగ్‌కు టీఆర్ఎస్‌, బీజేపీ డిమాండ్‌

Update: 2020-12-01 10:20 GMT

హైదరాబాద్‌ ఉప్పల్‌లో రీపోలింగ్‌కు టీఆర్ఎస్‌, బీజేపీ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సూర్యాపేట, తుంగతుర్తి, కొడంగల్‌ నుంచి కొందరు వ్యక్తులను తీసుకొచ్చి.. దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఉప్పల్‌ ప్రధాన రహదారిపై టీఆర్ఎస్‌ అభ్యర్థి బైఠాయించారు. కాంగ్రెస్‌ దొంగ ఓట్లు వేయిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ కొద్దిమేర పుంజుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 25.34 శాతం నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. పోలింగ్ ఉదయం నుంచి మందకొడిగా సాగిన మధ్యాహ్నం తర్వాత కొంతమేర పెరిగింది.

Tags:    

Similar News