Yadadri Temple - Shravana Masam: యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

Yadadri Temple: * దర్శనానికి 2గంటల సమయం * ఆదివారం, శ్రావణ మాసం కావడంతో భక్తుల రద్దీ * భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు

Update: 2021-08-29 08:39 GMT

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం (ఫైల్ ఫోటో )

Yadadri Temple - Shravana Masam: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తులు రద్దీ అధికంగా ఉంది. వారాంతపు సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. యాదాద్రీశుడి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. యాదాద్రిపై ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించ లేదు. ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News