ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్కు ఆహ్వానం
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయిన ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్
CM KCR: హైదరాబాద్లో నిర్వహించనున్న ఆధ్యాత్మిక సమ్మేళనంలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. రామచంద్ర మిషన్ ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్ ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రామచంద్ర మిషన్ నిర్వహిస్తున్న సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను కేసీఆర్కు వివరించారు.