Puvvada Ajay Kumar: సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Puvvada Ajay Kumar: ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Update: 2023-03-24 08:31 GMT

Puvvada Ajay Kumar: సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

Puvvada Ajay Kumar: అకాల వర్షాలకు పంటనష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా అల్లిపురంలో పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్బంగా అల్లిపురం, కొత్తగూడెం గ్రామాలకు సంబంధించిన 60 మంది రైతులకు అసైన్డ్ భూముల ఓఆర్సీ పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన గ్రామస్తులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పంటనష్ట పోయిన రైతులకు, కౌలు దారులకు ఎకరాకు 10 వేల రూపాయల పరిహారం ప్రకటించడంపై ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News