Congress: ఈ నెల 26లోగా అభ్యర్థులను ఫైనల్ చేయనున్న కాంగ్రెస్

Congress: నిన్నటి సమావేశంలో కొలిక్కిరాని టికెట్ల పంచాయతీ

Update: 2023-10-22 08:30 GMT

Congress: ఈ నెల 26లోగా అభ్యర్థులను ఫైనల్ చేయనున్న కాంగ్రెస్

Congress: ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితానపై కసరత్తు ప్రారంభించింది అధిష్టానం. ఇందులో భాగంగానే నిన్న దాదాపు ఆరు గంటల పాటు సమావేశమై చర్చించారు నేతలు. అయినప్పటికీ టికెట్ల అంశం కొలిక్కిరాలేదు. ఈ నెల 26లోగా అభ్యర్థులను ఫైనల్ చేసి, అనౌన్స్ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

Tags:    

Similar News