Seetha Akka: తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం చేసిన మంత్రులు
Seetha Akka:ఉద్యమకారులకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తోంది
Seetha Akka: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన ఉద్యమకారుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా హన్మకొండలో ఉద్యమకారులకు సన్మానం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టిన సమయంలో నాటి స్పీకర్ మీరా కుమారి, సుష్మా స్వరాజ్ పాత్ర క్రియాశీలకమన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలను చూసి స్వరాష్ట్ర కాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారన్నారు సీతక్క.