KCR: ఇవాళ్టి నుంచి మళ్లీ కేసీఆర్‌ బస్సు యాత్ర

KCR: రామగుండంలో రోడ్‌షోతో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం

Update: 2024-05-03 04:44 GMT

KCR: ఇవాళ్టి నుంచి మళ్లీ కేసీఆర్‌ బస్సు యాత్ర 

KCR: బీఆర్ఎస్ అధినేత ఎన్నికల ప్రచారం ఇవాళ్టీ రాత్రి నుంచి మళ్లీ కొనసాగనున్నది. కేసీఆర్ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం రాత్రి 8 గంటలతో ముగియనున్నది. ఈసీ నోటీసులతో జమ్మికుంటలో నిర్వహించాల్సిన రోడ్ షో రద్దు చేసుకున్నారు. రామగుండం నుంచి బస్సు యాత్ర తిరిగి కొనసాగించనున్నారు. రాత్రికి రామగుండంలో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. రేపు మంచిర్యాలలో 5వ తేదీన జగిత్యాల, 6న నిజామాబాద్, 7న కామారెడ్డి, మెదక్, 8వ తేదీన నర్సాపూర్, పటాన్ చెరు, 9న కరీంనగర్ లో కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్‌షోలో పాల్గొంటారు. 10వ తేదీన సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్దిపేటలో బహిరంగ సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు.

Tags:    

Similar News