Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది

Update: 2024-08-24 11:51 GMT

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని...కేసులో కీలక నిందితులు ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై...రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్‌ని కోరామన్నారు. సీబీఐ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన తర్వాత వారిని దేశానికి తీసుకొస్తామని అన్నారు. ఈ కేసులో ఎవరికి సంబంధం ఉన్నా వారిని విచారిస్తామని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News