Maheshwar Reddy: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకం

Maheshwar Reddy: హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాo

Update: 2024-09-10 08:17 GMT

Maheshwar Reddy: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకం

Maheshwar Reddy: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదన్నారాయన.. హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.. ఫిరాయింపులు చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. హైకోర్టు తీర్పును పొన్నం ప్రభాకర్ కూడా స్వాగతిస్తున్నారని, పొన్నం ప్రభాకర్ స్వాగతించడం కాదని, ఆచరణలో అమలు చేయాలని సీఎంకు, ఖర్గేకు సూచించాలని ఏలేటి సూచించారు. ఫిరాయింపులకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా పొందుపరిచారని అన్నారు మహేశ్వర్ రెడ్డి.. పార్టీ ఫిరాయింపుదారుడికి పీఏసీ చైర్మన్ ఇవ్వడం హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు.

Tags:    

Similar News