సీఎం రేవంత్‌పై ఈడీకి ఫిర్యాదు

Krishank: మనీ లాండరింగ్‌ కోణంలో విచారణ జరపాలని కోరిన క్రిషాంక్

Update: 2024-08-20 13:35 GMT

Revanth Reddy

Krishank: సీఎం రేవంత్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. ఇటీవల సీఎం పర్యటనలో జరిగిన స్వచ్ఛ్‌ బయో ఒప్పందంపై బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ ఈడీకి ఫిర్యాదు చేశారు. స్వచ్ఛ్ బయోలో సీఎం రేవంత్‌ సోదరుడు అనుముల జనార్ధన్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారన్న క్రిషాంక్.. మనీ లాండరింగ్‌‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎం పర్యటనకు 15రోజుల ముందే స్వచ్ఛ్‌ బయో కంపెనీ ఏర్పాటైందని ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లిహిల్స్‌లో కంపెనీ ఉన్నట్టు ఇచ్చిన అడ్రస్‌లోనూ ఎలాంటి నేమ్‌ బోర్డ్ పెట్టలేదని తెలిపారు. ఈ విషయాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని.. అందుకే మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయాలని ఈడీని కోరినట్టు వెల్లడించారు క్రిశాంక్.

Tags:    

Similar News