అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్‌ను ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: కేసీఆర్‌కు పాలమూరు జిల్లా వాసులు ఏం అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-27 08:20 GMT

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్‌ను ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: కేసీఆర్‌కు పాలమూరు జిల్లా వాసులు ఏం అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకుని మోశారని, అత్యధిక మెజారిటీతో పార్లమెంట్‌కు పంపారని, కానీ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారాయన.. మహబూబ్ నగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాడని పార్లమెంట్‌కు కేసీఆర్‌ను పంపితే అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు రేవంత్.

Tags:    

Similar News