Kishan Reddy: గోవా కి నేరుగా రైలును ప్రారంభించడం సంతోషంగా ఉంది
Kishan Reddy: గతంలో గోవా కి వెళ్లాలంటే కనెక్టివిటి ద్వారా వెళ్ళాల్సి వచ్చేది
Kishan Reddy: సికింద్రాబాద్ – గోవా వెళ్లే రైలు ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని భోయి గూడా వైపు గల పదో నెంబర్ ప్లాట్ ఫారం పై నుంచి గోవా రైలు సర్వీస్ ను ప్రారంభించారు. తెలంగాణ రాజధానితో గోవా రాజధాని వాస్కో-డ-గామాతో మెరుగైన అనుసంధానం చేశారు. ఈ రైలు వారానికి రెండు రోజులు ఇరు మార్గాలలో నడపబడుతోంది. ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గోవాకి నేరుగా రైలును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.