Kandala Upender Reddy: షేక్‌పేట MRO కంప్లైంట్.. BRS మాజీ ఎమ్మెల్యేపై భూకబ్జా కేసు

Kandala Upender Reddy: నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు

Update: 2024-01-01 12:15 GMT

Kandala Upender Reddy: షేక్‌పేట MRO కంప్లైంట్.. BRS మాజీ ఎమ్మెల్యేపై భూకబ్జా కేసు

Kandala Upender Reddy: బీఆర్ఎస్ పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌లోని అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమించారనే ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. షేక్ పేట్ తహశీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కందాల ఉపేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. 447,427,467,468,471 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.

Tags:    

Similar News