Indian cricket team: విశ్వవిజేతలకు గ్రాండ్ వెల్కమ్..ప్రధాని మోదీని కలవనున్న టీమిండియా ఆటగాళ్లు

Indian cricket team: టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు భారత్ లో అడుగుపెట్టారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో అభిమానులు ఆటగాళ్లకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి టీమ్ బస్సులో హోటల్‌కు బయలుదేరారు. టీమ్ ఇండియా నేడు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనుంది.

Update: 2024-07-04 03:00 GMT

Indian cricket team: విశ్వవిజేతలకు గ్రాండ్ వెల్కమ్..ప్రధాని మోదీని కలవనున్న టీమిండియా ఆటగాళ్లు

 Indian cricket team:టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు స్వదేశానికి తిరిగి వచ్చింది. బార్బడోస్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ఇండియా అక్కడ సంభవించిన తుఫాను కారణంగా వెంటనే బయలుదేరలేకపోయింది. ఎయిరిండియా ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి నేరుగా టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆటగాళ్లకు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ముందుగా ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. ఆ తర్వాత బృందం మొత్తం ముంబైకి బయలుదేరి అక్కడ సాయంత్రం విజయోత్సవ పరేడ్ ఉంటుంది.


భారత జట్టుకు ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. అక్కడ వారికి స్వాగతం పలికేందుకు టీమ్ ఇండియా జెర్సీ రంగులో కేక్‌ను సిద్ధం చేశారు. అందులో ట్రోఫీని ప్రదర్శించారు. ఈ కేక్ చాక్లెట్ నుండి తయారు చేశారు. ఐటిసి మౌర్య హోటల్ చీఫ్ చెఫ్, శివనీత్ పహోజా మాట్లాడుతూ ప్రపంచ కప్ గెలిచిన మా జట్టుకు స్వాగతం పలికేందుకు దీనిని సిద్ధం చేశామన్నారు. దీంతోపాటు వారి కోసం ప్రత్యేకంగా అల్పాహారం కూడా సిద్ధం చేశామని తెలిపారు.



Tags:    

Similar News