MUDA Scam: కర్నాటకను కుదిపేసిన ముడా స్కామ్ ఆరోపణలు.. రాత్రంతా అసెంబ్లీలోని బీజేపీ ఎమ్మెల్యేల ధర్నా
MUDA Scam: కర్నాటకలో ముడా స్కామ్ సంచలనాన్ని రేకెత్తిస్తోంది.
MUDA Scam: కర్నాటకలో ముడా స్కామ్ సంచలనాన్ని రేకెత్తిస్తోంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కుంభకోణం జరిగిందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టినా స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో విధానసౌధలోనే రాత్రి బస చేశారు. ముడా స్కామ్లో సీఎం సిద్ధరామయ్య సతీమణి ప్రమేయముందనే ఆరోపణలు రావడంతో బీజేపీ ఎమ్మెల్యేలు చర్చ పట్టుబట్టారు. ఈ స్కామ్తో ఖజానాకు 4 వేలకోట్ల నష్టం వాటిల్లిందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.