Nithish Kumar: మోడీ సర్కార్‌కి భారీ షాకిచ్చిన బిహార్ సీఎం నితీశ్ కుమార్

Nithish Kumar: బిహార్‌కి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్

Update: 2024-06-29 14:12 GMT

Nithish Kumar: మోడీ సర్కార్‌కి భారీ షాకిచ్చిన బిహార్ సీఎం నితీశ్ కుమార్

Nithish Kumar: బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ డిమాండ్‌ చేసింది. ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. బీహార్‌ ఆర్థికంగా, అభివృద్ధిలో వెనుక ఉండటాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని, దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కాగా, బీహార్‌లో ఇటీవల 65 శాతానికి పెంచిన రిజర్వేషన్ కోటాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

న్యాయపర పరిశీలన, రక్షణ కోసం రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో రిజర్వేషన్‌ కోటాను చేర్చాలని జేడీయూ ప్రతిపాదించింది. అలాగే ఈ కోటాను నిరంతరాయంగా అమలు చేస్తామని జేడీయూ హామీ ఇచ్చింది. మరోవైపు జేడీయూ కీలక సమావేశం తర్వాత ఆ పార్టీ సీనియర్‌ నేత మీడియాతో మాట్లాడారు. బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ కొత్తది కాదని తెలిపిరు. బీహార్ అభివృద్ధిని వేగవంతం చేయడం, రాష్ట్ర ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమని అన్నారు.

Tags:    

Similar News