Ashwini Vaishnaw: భారీగా పెరగనున్న జనరల్ కోచ్‌లు..

Ashwini Vaishnaw: ప్రత్యేక డ్రైవ్ కింద 25 వందల జనరల్‌ కోచ్‌ల తయారీ చేపట్టామని, మరో 10 వేల జనరల్‌ కోచ్‌లకు ఆమోదం లభించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Update: 2024-07-05 16:00 GMT

Ashwini Vaishnaw: భారీగా పెరగనున్న జనరల్ కోచ్‌లు..

Ashwini Vaishnaw: ప్రత్యేక డ్రైవ్ కింద 25 వందల జనరల్‌ కోచ్‌ల తయారీ చేపట్టామని, మరో 10 వేల జనరల్‌ కోచ్‌లకు ఆమోదం లభించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ వేసవిలో భారీ రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 10 వేలకుపైగా ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు. రైల్వేల సేవలు, భద్రత, పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు తాము కసరత్తు సాగిస్తున్నామని చెప్పారు. 50 అమృత్‌ భారత్‌ ట్రైన్ల తయారీ ప్రారంభమైందని, 150 అమృత్‌ భారత్‌ ట్రైన్ల తయారీ ప్రక్రియ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

Tags:    

Similar News