ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావే‎శం

ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకోనున్న అగ్రనేతలు

Update: 2024-06-06 05:22 GMT

ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావే‎శం

ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ అగ్రనేతలు సమావేశం కానున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పార్టీ అధ్యక్షులతో మోడీ, అమిత్ షా, నడ్డా భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకోనున్నారు.

18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అగ్రనేతలతో సహా.. మోడీ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు రాగా.. ఈసారి 240 దగ్గరే ఆగిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే.. 63 స్థానాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీలోనే గతంతో పోలిస్తే... 29 సీట్లును కోల్పోవడం.. మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. యూపీతోపాటు.. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో సీట్లు తగ్గడానికి కారణాలపై బీజేపీ అగ్రనేతల పోస్ట్ మార్టం నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News