Ladakh: సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. ఐదుగురు జవాన్ల మృతి

Ladakh: లడఖ్‌లో ఆర్మీ విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది.

Update: 2024-06-29 07:45 GMT

Ladakh: సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. ఐదుగురు జవాన్ల మృతి

Ladakh: లడఖ్‌లో ఆర్మీ విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. దౌలత్‌ బేగ్‌ ఓల్డీ ప్రాంతంలో నదిని దాటేందుకు యత్నిస్తుండగా ఆర్మీ ట్యాంక్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. నదిని దాటే ట్యాంక్‌ విన్యాసాలు చేస్తుండగా.. ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. టీ-72 ట్యాంక్‌కు ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి ఉన్నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News