Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణహానీ బెదిరింపులు.. ఈద్ రోజు సల్మాన్ ఏం చేశాడంటే?
Salman Khan: తొలిరోజే రూ.30 కోట్ల వసూళ్లు రాబట్టి మంచి ప్రారంభం అందుకుంది. ఈద్ సెలబ్రేషన్స్ ప్రభావంతో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణహానీ బెదిరింపులు.. ఈద్ రోజు సల్మాన్ ఏం చేశాడంటే?
Salman Khan: సల్మాన్ ఖాన్ తన సంప్రదాయ ప్రకారం ఈద్ రోజున అభిమానులకు అభివాదం తెలిపారు. ముంబై బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉన్న తన నివాసం వద్ద భారీ సంఖ్యలో చేరిన అభిమానులకు, సల్మాన్ గాజు అవరోధం వెనుక నుంచి అభివందనాలు తెలిపారు. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చిన ప్రాణహానీ బెదిరింపుల నేపథ్యంలో తన అపార్ట్మెంట్ ముందు బులెట్ప్రూఫ్ గ్లాస్ అమర్చిన సంగతి తెలిసిందే.
ఈద్ రోజు, తెలుపు కుర్తా-పైజామాలో కనిపించిన సల్మాన్ తన సోదరి అర్పితా ఖాన్ పిల్లలు ఆయాత్, ఆసిల్తో కలిసి కనిపించాడు. గ్లాస్ వెనుక నుంచి అభిమానులకు అభివందనలు తెలుపుతూ చిరునవ్వుతో అభిమానం చాటుకున్నాడు. ఆయాత్ను ఎత్తుకుని బయట గుమికూడిన అభిమానులను చూపిస్తూ సల్మాన్ తన సోషల్ మీడియాలో వీడియో కూడా పంచుకున్నాడు.
ఇతీవలే అతను బులెట్ప్రూఫ్ కారు కొనుగోలు చేశాడు. అలాగే షూటింగ్ల సమయంలో ముంబయి, హైదరాబాద్లో అతనికి అదనపు ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయబడింది. ఇప్పటికే ఉన్న బాడీగార్డులకు తోడుగా ఈ భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి. ఇంకా సల్మాన్ తాజా సినిమా 'సికందర్' కూడా ఈద్ సందర్భంగా విడుదలైంది. తొలిరోజే రూ.30 కోట్ల వసూళ్లు రాబట్టి మంచి ప్రారంభం అందుకుంది. ఈద్ సెలబ్రేషన్స్ ప్రభావంతో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మొదటి వారం చివరికి ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్ చేరుతుందని అంచనా వేస్తోంది.
సికందర్ చిత్రంలో సల్మాన్తో పాటు సత్యరాజ్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, శర్మన్ జోషి కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను సాజిద్ నాడియాడ్వాలా నిర్మించగా, సల్మాన్ తన తదుపరి ప్రాజెక్ట్ను త్వరలో ప్రకటించనున్నాడు.