Jayam Ravi Engagement: జయం రవితో ఎంగేజ్మెంట్.. స్పందించిన ప్రియాంక మోహన్

Update: 2024-10-26 10:53 GMT

Jayam Ravi, Priyanka Mohan Engagement News: కోలీవుడ్ హీరో జయం రవి, హీరోయిన్ ప్రియాంక మెహన్ ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ప్రియాంక మోహన్ పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో జయం రవితో పెళ్లి వార్తలపై ప్రియాంక మోహన్ క్లారిటీ ఇచ్చారు

తమిళనాడులో జయం రవికి మంచి క్రేజ్ ఉంది. జయం రవి నుంచి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుందనే విధంగా ఆయన పేరు సంపాదించుకున్నారు. అయితే జయం రవి వైవాహిక జీవితం గురించి గత కొద్ది రోజులుగా అనేక రూమర్స్ వైరల్ అయ్యాయి. జయం రవి ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడిపోవాలని చూస్తున్నారని, విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించినట్లు పుకార్లు వచ్చాయి.

ఆ పుకార్లకు బలం చేకూరుస్తూ తాము నిజంగానే విడిపోతున్నట్టు జయం రవి సోషల్ మీడియా ద్వారా ఒక అధికారిక ప్రకటన చేశారు. అయితే విడాకుల గురించి తనని సంప్రదించకుండానే ప్రకటించారని జయం రవి భార్య ఆర్తి ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తరువాత భార్య నుంచి విడాకులు తీసుకుని పది రోజులు కూడా కాకుండానే జయం రవి మరో అమ్మాయితో క్లోజ్‌గా ఉన్నట్లు వార్తలొచ్చాయి. కేనిషా ఫ్రాన్సిస్ అనే సింగర్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ తెర మీదకు వచ్చాయి. సరిగ్గా ఇదే సమయంలో జయం రవి, హీరోయిన్ ప్రియాంక మోహన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు పెళ్లి దుస్తుల్లో కనిపించారు. దీంతో జయం రవి , ప్రియాంక మోహన్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు మరో ప్రచారం జరిగింది.

దీంతో నెటిజన్లు ప్రియాంక మోహన్‌పై కామెంట్స్ చేయడం మొదలెట్టారు. విడాకులు తీసుకున్న వ్యక్తి తప్ప పెళ్లి చేసుకోవడానికి వేరే వ్యక్తి దొరకలేదా ? అంటూ ప్రియాంక మోహన్ పై మండిపడ్డారు. దీంతో జయం రవితో నిశ్చితార్థం గురించి ప్రియాంక మోహన్ వివరణ ఇచ్చారు. జయం రవి, తాను బ్రదర్ సినిమాలో నటిస్తున్నామని.. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఈవెంట్ పెట్టి చిత్ర బృందం మా ఇద్దరికి సంబంధించిన ఒక ఫొటో రిలీజ్ చేశారని తెలిపారు. అందులో మేమిద్దరం మెడలో పూల దండలు చేసుకుని ఉన్నామని చెప్పుకొచ్చింది.

దీంతో అది నెట్టింట క్షణాల్లో వైరల్ అయిందని.. ఇక అది చూసిన వారంతా మాకు ఎంగేజ్‌మెంట్ అయిందని అనుకున్నారని తెలిపారు. వరుస షూట్స్ వల్ల తాను బిజీగా ఉండడంతో ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఇది నిజమేనని నమ్మిన టాలీవుడ్‌లోని తన స్నేహితులు వరుస కాల్స్ చేసి కంగ్రాట్స్ చెప్పారని తెలిపారు. అప్పుడు తనకు ఏమీ అర్థం కాలేదని.. అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడిపోయానన్నారు. ఆ తర్వాత పూర్తి విషయాన్ని తెలుసుకుని కాల్ చేసి మరీ అది కేవలం సినిమాలోని స్టిల్ మాత్రమేనని చెప్పానన్నారు. ఆ తర్వాత మూవీ టీమ్‌ను చాలా తిట్టుకున్నానన్నారు. ఎందుకంటే వారు వేరే ఫొటో ఏదైనా రిలీజ్ చేయొచ్చు కదా ఇది ఎందుకు చేశారా అని.. అందుకే అంతా నిశ్చితార్థం అయిందని అనుకున్నారని చెప్పుకొచ్చింది.

ఇక ఈ విషయం పక్కన పెడితే గ్యాంగ్‌లీడర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. ఇటీవల విడుదలైన సరిపోదా శనివారంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ మూవీతో బిజీగా ఉన్నారు. మరోవైపు కోలీవుడ్‌లో ఆమె నటించిన బ్రదర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News