Bigg Boss 7 Telugu: తేజ కథ ముగిసే.. సేఫ్ జోన్‌లో శోభా..వాళ్ల ఉసురు తగిలిందంటోన్న జనాలు?

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడు 12 మందే ఉన్నారు. వీరిలో శివాజీ, గౌత‌మ్‌, ప్ర‌శాంత్‌, అశ్విని తప్ప మిగ‌తా వారంతా నామినేష‌న్స్‌లో నిలిచారు.

Update: 2023-11-04 14:45 GMT

Bigg Boss 7 Telugu: తేజ కథ ముగిసే.. సేఫ్ జోన్‌లో శోభా..వాళ్ల ఉసురు తగిలిందంటోన్న జనాలు?

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడు 12 మందే ఉన్నారు. వీరిలో శివాజీ, గౌత‌మ్‌, ప్ర‌శాంత్‌, అశ్విని తప్ప మిగ‌తా వారంతా నామినేష‌న్స్‌లో నిలిచారు. అయితే, ఈ సారి జనాల ఫోకస్ అంతా కార్తీక దీపం విలన్ మోనిత అలియాస్ శోభాశెట్టిపై నిలిచాయి. గ‌త‌వార‌మే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్తుందని అంతా భావించారు. కానీ, బిగ్ బాస్ మాత్రం ఆట సందీప్‌ను ఇంటికి పంపి, భారీ షాక్ ఇచ్చాడు. దీంతో శోభా శెట్టి హౌస్‌లోనే ఉంది. దీంతో ఈ వారం తప్పకుండా బిగ్ బాస్ హౌస్ నుంచి తప్పుకుంటుందని అనుకున్నారు. కానీ, మ‌రో కంటెస్టెంట్‌ను బ‌లి చేస్తారా ఏంటి అని అనుకున్నారు. అయితే, జనాలు అనుకున్నదే అయింది. ఇంత‌కీ ఆ కంటెస్టెంట్ ఎవ‌రో కాదు.. శోభా బెస్ట్ ఫ్రెండ్ టేస్టీ తేజ‌.

నామినేషన్స్ అంటేనే టేస్టీ తేజ భయపడిపోతుంటాడు. ఇక ఎలిమినేషన్స్ మాట వినకూడదంటూ కోరుకుంటుంటాడు. ఈ క్రమంలో టేస్టీ తేజను నామినేట్ చేస్తే నేనేం చేశానంటూ అడిగేస్తాడు? నన్నే ఎందుకు నామినేట్ చేశారంటూ? ప్రశ్నిస్తాడు. కానీ, టేస్టీ తేజ మాత్రం సిల్లీ రీజన్స్‌తో నామినేషన్స్‌లోకి పంపిస్తుంటాడు.

కంటెస్టెంట్స్ ఎంత చెప్పినా తీరు మారని తేజను.. ఈ వారం అదే సిల్లీ కారణాలతో శివాజీ నామినేట్ చేశాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఈ వారం నేనే ఎలిమినేట్ అవుతానంటూ భయపడిపోతున్నాడు. అనుకున్నట్లే తేజ‌ బిగ్ బాస్ హౌస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో శోభా శెట్టి సేఫ్ జోన్‌లోకి వెళ్లింది.

Tags:    

Similar News