Priyanka Mohan: అది నా అదృష్టం.. నటి ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే పవన్ హీరోగా, సుజీత్‌ దర్శకత్వంలో 'ఓజీ' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్యకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Update: 2024-08-20 10:30 GMT

priyanka mohan

2019లో కన్నడ చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార ప్రియాంక మోహన్‌. ఆ తర్వాత నాని హీరోగా తెరకెక్కిన 'నాని గ్యాండ్ లీడర్‌' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైందీ బ్యూటీ. తొలి సినిమాతో తనదైన అందం, అభినయంతో మెస్మరైజ్‌ చేసింది. ఆ తర్వాత శ్రీకారం మూవీతో మరోసారి తెలుగులో నటించి మెప్పించింది.

కాగా అనంతరం మళ్లీ తమిళంలో వరుస నినిమాల్లో నటించింది. అయితే తెలుగులో మంచి సాలిడ్‌ విజయాన్ని అందుకోలేకపోయింది ప్రియాంక. కాగా తాజాగా నానితో మరోసారి జతకడుతోంది ప్రియాంక. 'సరిపోదా శనివారం' సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధవుతోంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. పవర్‌ స్టార్‌తో నటించే లక్కీ ఛాన్స్‌ అందుకున్న విషయం గురించి మాట్లాడుతూ.. ‘ఓజీ లాంటి గొప్ప కథలో భాగం కావడం, వపన్‌ సర్‌ పక్కన నటించడం నా అదృష్టం. ఆ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. పవన్‌ కల్యాణ్‌, నాని ఇద్దరూ క్రియేటివ్‌గా ఉంటారు. నాని సినిమాల గురించి ఎప్పుడూ కలలు కంటారు. పవన్‌ ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తుంటారు’ అని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే పవన్ హీరోగా, సుజీత్‌ దర్శకత్వంలో 'ఓజీ' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్యకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా స్టోరే ముంబయి నేపథ్యంగా సాగే గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో తెరకెక్కుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News