OTT: నేరుగా ఓటీటీలో సైకలాజిక్‌ థ్రిల్లర్‌.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే.. !

Aham Reboot: కరోనా సమయంలో సినిమాలు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-06-29 09:30 GMT

OTT: నేరుగా ఓటీటీలో సైకలాజిక్‌ థ్రిల్లర్‌.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే.. !

Aham Reboot: కరోనా సమయంలో సినిమాలు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తిరిగి థియేటర్లు ఓపెన్‌ అయిన తర్వాత. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత సినిమాలు ఓటీటీలో సందడి చేశాయి. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ తెలుగు సినిమా నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

టాలీవుడ్ హీరో సుమంత్‌ నటించిన అహం రీబూట్‌ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలకానుంది. సైకలాజికల్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్‌, టీజర్‌లు సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నిజానికి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావించారు.

అయితే అనివార్య కారణాల కారణంగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ ఆహా వేదికగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో సుమంత్ ఆర్జే నిలయ్ అనే క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు. సిటీలో వ‌రుస‌గా అమ్మాయిలు కిడ్నాప్‌ల‌కు గుర‌వుతుంటారు. వారిని ఆర్జే నిల‌య్ ఎలా కాపాడాడు? ఈ కిడ్నాప్‌ల వెనుక ఎవ‌రున్నారు అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ 2021లో ప్రారంభమై 2022లో పూర్తయింది. అయితే అప్పటి నుంచి ఈ సినిమా విడుదల వాయిదా పడుతూనే వచ్చింది. అయితే తాజాగా చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్‌ నిర్ణయం తీసుకున్నారు. మరి యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి. 

Tags:    

Similar News