మంటల్లో చిక్కుకున్న బస్సు: 25 మంది చిన్నారుల సజీవ దహనం

Update: 2024-10-01 10:31 GMT

మంటల్లో చిక్కుకున్న బస్సు: 25 మంది చిన్నారుల సజీవ దహనం

బ్యాంకాక్ లో జరిగిన ప్రమాదంలో 25 మంది చిన్నారులు మృతి చెందారు. సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి 38 మంది విద్యార్థులు, ఆరుగురు స్కూల్ టీచర్లతో వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లను రక్షించారు. ప్రమాదం నుంచి బయటపడిన వారి సంఖ్య ఆధారంగా ఈ ప్రమాదంలో 25 మంది చనిపోయి ఉంటారని మంత్రి అనుతిన్ చర్నవిరకుల్ చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. బస్సులో మంటలు వ్యాపించడానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News