Accident: ఘోరరోడ్డు ప్రమాదం..తిరుపతి వెళ్తున్న బస్సును ఢీకొన్న లారీ.. 9మంది మృతి

Accident:బెంగుళూరు నుంచి తిరుపతి వెళ్తున్న బస్సు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.

Update: 2024-07-12 04:13 GMT

Accident: ఘోరరోడ్డు ప్రమాదం..తిరుపతి వెళ్తున్న బస్సును ఢీకొన్న లారీ.. 9మంది మృతి

Accident:బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోలార్ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున పెను ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించగా..మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ బస్సు ప్రయాణికులతో బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 



Tags:    

Similar News